ఒక్క సినిమాతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ముంబై భామ పాయల్ రాజ్ పుత్. బాలీవుడ్ సీరియస్ లో నటిస్తున్న ఈ అమ్మడు ఇటీవల రిలీజ్ అయిన ఆరెక్స్ 100 సినిమాలో నటించింది. కేవలం నటించడమే కాదు కుర్రాళ్ల మతులు పోగొట్టే అందాలతో అదరగొట్టింది. 


చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఆరెక్స్ 100 పెద్ద విజయాన్ని అందుకుంది. 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే 20 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన పాయల్ రాజ్ పుత్ కు తెలుగులో మంచి పాపులారిటీ వచ్చింది.


అందుకే తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. లేటెస్ట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ పాయల్ రాజ్ పుత్ మీద కన్నేసినట్టు తెలుస్తుంది. బెల్లంకొండ సురేష్ తనయుడిగా మొదటి సినిమానే సమంత, తమన్నాలాంటి హీరోయిన్స్ తో జోడి కట్టిన బెల్లంకొండ బాబు ఈసారి కాజల్ తో రొమాన్స్ చేస్తున్నాడు.


తేజ డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. దానికి ముందు బెల్లంకొండ హీరోగా నూతన దర్శకుడు ఓ సినిమా చేస్తున్నాడు. అందులో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా అందులో సెకండ్ హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ను సెలెక్ట్ చేశారట. మొత్తానికి పాయల్ తో రొమాన్స్ కు బెల్లంకొండ భారీ స్కెచ్ వేశాడనే చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: