టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్స్ సినిమాలు వరుసగా వస్తున్నాయి.  దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి బయోపిక్ ను ‘యాత్ర’ పేరుతో మహి.వి.రాఘవ్ తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కి సంబంధించి మరోక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  వైఎస్. జగన్ పాత్రలో తమిళ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్నారట. సూర్యకు, జగన్ కు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.

జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేస్తున్న సమయంలో సూర్య ఆయనను ఎంతగానో మెచ్చుకున్నారు.  ప్రజల కోసం అన్ని వేల కిలోమీటర్లు పాద యాత్ర చేయడం అనేది నిజమైన నాయకుడి లక్షణం అంటూ ఖితాబు ఇచ్చారు.   ఇక మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్ర చేస్తుండగా… ఆయన తండ్రి రాజారెడ్డి పాత్రలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు నటిస్తున్నాడు. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ మోహనరెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆయన ఇప్పుడు ఎంతో కీలకంగా మారారు.   

అయితే జగన్ , సూర్యకు ఉన్న స్నేహ సంబంధాల కారణంగానే కార్తీ యాత్ర సినిమా లో నటించడానికి అంగీకరించారని సమాచారం. ఐతే ఈ వార్తకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ లతో పాటు ‘రంగస్థలం’సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాకు విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: