టాలీవుడ్ లో ఇప్పటి రవకు  మెగా ఫ్యామిలీలో యంగ్ హీరోలు అరడజను మంది వున్నారు.  చిరంజీవి అడుగు జాడలలో వెళుతున్న మెగా హీరోలందరు మంచి సక్సెస్ రేటుతో ముందుకెళుతున్నారు. కుర్రహీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించేందుకు చాలా కష్టపడుతున్నారు. మొదట్లో మంచి హిట్స్ కొట్టిన సాయి ధరమ్ ప్రస్తుతం ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతుండగా, వరుణ్ తేజ్ స్లో అండ్ స్టడీగా మంచి విజయాలతో దూసుకెళుతున్నాడు.  ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ ఇద్దరు హీరోలు వెరీ క్లోజ్.


అప్పుడప్పుడూ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. పార్టీలు గట్రా చేసుకుంటారు. లేటెస్ట్‌గా ఇద్దరూ కలిసినప్పుడు దిగిన ఫొటోనే మీరు చూస్తున్నది. అందులో జోకర్ మాస్క్ వేసుకున్నది సాయిధరమ్ తేజ్. ట్రంప్ మాస్క్ వేసుకున్నది వరుణ్ తేజ్.  ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ చేతిలో ఒకే ఒక్క సినిమా సెట్స్ పై ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్న ‘చిత్రలహరి’ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. దానికోసం వెయిట్ చేస్తూ బరువు తగ్గి ఆ పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు. 


ఇటీవల వరుణ్ తేజ్ ‘ఎఫ్2’ ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేశాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న స్పేస్ థ్రిల్లర్ షూటింగ్ షెడ్యూల్స్ మధ్య కూడా గ్యాప్ వచ్చింది. దాంతో ఇద్దరూ కలిసి ఇలా తమ హాలిడేస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ  గ్యాప్ లో వరుణ్ తేజ్  సాయిధరమ్  కలిశారు. ఇద్దరూ కలిసి మాస్కులు వేసుకొని ఓ ఫొటో దిగి అభిమానులతో పంచుకున్నారు. జోకర్ మాస్క్ లో సాయిధరమ్ తేజ్ - ట్రంప్ మాస్క్ లో వరుణ్ తేజ్ కనిపించి అలరించారు.  ఇద్దరూ ప్రస్తుతం హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: