మళయాల ప్రేమం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన తమిళమ్మాయి సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో అమ్మడి పర్ఫార్మెన్స్ కు అందరు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఎం.సి.ఏ కూడా హిట్ అవడంతో సాయి పల్లవి రేంజ్ మారిపోయింది.


అయితే ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన కణం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ సినిమా టైంలో నాగ శౌర్యకు, సాయి పల్లవికి మధ్య గొడవ జరిగిందని అప్పట్లో టాక్ వచ్చింది. నాగ శౌర్య ఏకంగా పల్లవి మీద కామెంట్స్ కూడా చేశాడు. నాగ శౌర్య కామెంట్స్ మీద సాయి పల్లవి తాను నిజంగా తప్పు చేస్తే సారీ అనేసింది.


అది ముగిసింది కదా అనుకుంటే లేటెస్ట్ గా మరో సినిమా టైంలో తన హీరోతో సాయి పల్లవి గొడవపడిందని వార్తలు వస్తున్నాయి. శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న సినిమా పడి పడి లేచే మనసు సినిమా టైంలో కూడా శర్వాతో మిస్ బిహేవ్ చేసిందట సాయి పల్లవి.  


హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి కావాలని గొడవపడుతుందో లేక తన ప్రవర్తన వల్ల అలా గొడవ అనుకుంటారో కాని సాయి పల్లవి మీద ఈ వార్తలు ఎక్కువవుతున్నాయి. నాని ఎం.సి.ఏ టైంలో కూడా నాని, దిల్ రాజులతో కూడా సాయి పల్లవి కాస్త దురుసుగా ప్రవర్తించిందని అన్నారు. మంచి అభినయం కనబరచడమే కాదు మంచి ప్రవర్తన ఉంటేనే సినిమా ఛాన్సులు వస్తాయి. పొరపాటు తనదా లేక వేరే వాళ్లదా అన్నది సాయి పల్లవి తెలుసుకుని ఇక మీదట ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటే బెటర్. లేదంటే కెరియర్ రిస్క్ లో పడే అవకాశం ఉంది.   
 


మరింత సమాచారం తెలుసుకోండి: