బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో వచ్చిన సినిమా సాక్ష్యం. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో నామా అభిషేక్ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోలు లేటుగా పడ్డాయి. కొన్ని చోట్ల మార్నింగ్ షో కాకుండా మ్యాట్నీ నుండి వేశారు.


బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ లో భారీ బడ్జెట్ మూవీగా వచ్చింది సాక్ష్యం. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 25 కోట్ల దాకా జరిగింది. ఇక ఈ సినిమా మొదటి రోజు మొత్తంగా 3.11 కోట్లు వసూళు చేసింది. అయితే మొదటి షో పడకపొయినా సరే ఈ రేంజ్ లో కలెక్ట్ చేసిందంటే సాక్ష్యం బెల్లంకొండ బాబు సత్తా చాటిందని చెప్పొచ్చు.


ఇక ఈ కలక్షన్స్ బెల్లకొండ శ్రీనివాస్ కెరియర్ లో 3వ హయ్యెస్ట్ కలక్షన్స్ గా నిలిచాయి. జయ జానకి నాయక 3.28 కోట్లు కలెక్ట్ చేయగా.. అల్లుడు శీను సినిమా 3.27 కోట్లు కలెక్ట్ చేసింది. ఏరియాల వారిగా సాక్ష్యం కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే.. 


నైజాం : 0.95 కోట్లు  
సీడెడ్ : 0.50 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.42 కోట్లు
గుంటూర్ : 0.49 కోట్లు
ఈస్ట్ : 0.27 కోట్లు
వెస్ట్ : 0.17 కోట్లు
కృష్ణా : 0.19 కోట్లు
నెల్లూరు : 0.12 కోట్లు
ఏపి/తెలంగాణ : 3.11 కోట్లు 


మరింత సమాచారం తెలుసుకోండి: