పరుశురామ్ దర్శకత్వంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న కలిసి నటించిన సినిమా ‘గీత గోవిందం’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. హైదరాబాద్ లో జరిగిన ఈ ఆడియో లాంచ్ కార్యక్రమానికి అరవింద్ తో కలసి ముఖ్య అథిదిగా హాజరైన బన్నీ, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక అద్భుతంగా నటించారంటూ కితాబిచ్చాడు. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని ప్రశంసించాడు. 

ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ .. ముందుగా ఈ కథను అల్లు అర్జున్ కి వినిపించినట్టుగా చెప్పాడు.  అల్లు అర్జున్ కి ఈ కథ ఎంతగానో నచ్చిందనీ, అయితే కొన్ని కారణాల వలన ఆయన ఈ సినిమా చేయలేకపోయాడని అన్నాడు.  ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి సినిమా చూశాక వారంపాటు నేనెవరినీ కలవలేదు. ఏం సినిమాలు చేస్తున్నాం మనం అనిపించింది. దాదాపు 10రోజులు నేను డిస్టర్బ్ అయ్యాను. ఉన్న అవార్డుల్లో బెటర్ అవార్డ్ ఫిలింఫేర్. ఆ ఇయర్ ఫిలింఫేర్ అవార్డ్ అంటూ ఉంటే విజయ్ దేవరకొండ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌కి అది రావాలని మనస్ఫూర్తిగా అనుకున్నా.
Image result for geeta govindam audio launch
తెలుగులో విజయ్ ఒక గ్రేట్ పెర్ఫార్మర్. ఈ కథ నిజానికి హీరోయిన్ డామినేటెడ్ స్క్రిప్ట్. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్. విజయ్ ఎంత బాగా చేశాడంటే.. ఈ సినిమాను బోయ్ అండ్ గర్ల్ ఫిల్మ్‌గా మార్చేశాడు. సినిమా చూశాను నాకు చాలా బాగా నచ్చింది’’ అని అన్నారు.  ఈ సందర్భంగా ఈ సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని ప్రశంసించాడు.
Image result for geeta govindam audio launch
అనంతరం అరవింద్ కు ఆల్ ది  బెస్ట్ చెప్పిన బన్నీ, ఎక్కువ డబ్బులు సంపాదించి తనకో కారు కొని పెట్టాలని కోరాడు. దీంతో స్టేజ్ పై ఉన్న దర్శకుడు పరశురామ్, విజయ్, రష్మిక సహా అందరి మొహాలపై నవ్వులు పూశాయి.  విజయ్ దేవర కొండ, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: