ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనేనేను’ సినిమాతో మంచి విజయం అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం పైడిపల్లి వంశి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇండస్ట్రీలో మహేష్ బాబు తన ఫ్యామిలీతో భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాడని టాక్.  సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత అయినా..సక్సెస్ తర్వాత అయినా విదేశీ టూర్ కి వెళ్లడం చేస్తుంటారు.  తాజాగా మహేష్ బాబు తన కూతురు సితారతో ‘గ్రీన్ ఛాలెంజ్’ఛాలెంజ్ విసిరారు.   ప్రస్తుతం తెలంగాణ హరితహారంలో భాగంగా చేపట్టిన ‘గ్రీన్‌ ఛాలెంజ్’కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది.

ఈ కార్యక్రమానికి మద్దతుగా పలువురు ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌కు ప్రిన్స్ మహేశ్ బాబు స్పందించారు.  తన ముద్దుల తనయ సితారతో కలిసి మొక్కలు నాటారు. ఈ ఫొటోలను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన ముద్దుల తనయ సితారతో కలిసి మొక్కలు నాటారు. ఈ ఫొటోలను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 

తాజాగా కేటీఆర్ ఛాలెంజ్‌ స్వీకరించిన సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు త‌న కూతురు సితార‌తో క‌లిసి మొక్కలు నాటారు. తనను ఇలాంటి ఛాలెంజ్‌కు ఆహ్వానించినందుకు కేటీఆర్‌కు మ‌హేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. అనంత‌రం త‌న ముద్దుల త‌న‌య సితార‌, త‌న‌యుడు గౌతంతో పాటు ద‌ర్శకుడు వంశీ పైడిపల్లికి ఆయ‌న గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు, పూజా హెగ్డె జంటగా వంశి పైడి పల్లి దర్శకత్వంలో ప్రస్తుతం తన 25వ సినిమాలో నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: