మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా..రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మొదటి సారిగా బాలీవడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ నటిస్తున్నారు. చిరు సరసన నయనతార నటిస్తుండగా..జగపతిబాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి హైదరాబాద్ రెవెన్యూ అధికారులు షాకిచ్చారు.
చిరంజీవి తనయుడు రాంచరణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘రంగస్థలం’ చిత్రం కోసం వేసిన సెట్లోనే ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ జరుగుతోంది. అయితే, ఇది ప్రభుత్వ భూమి కావడం, అనుమతి లేకుండా సెట్ వేయడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోని కథనాయకుడి కోసం వేసిన ఇంటి సెట్ను కూల్చేశారు. ఇది ప్రభుత్వ భూమి కావడం వల్ల భూ కబ్జాకు పాల్పడే అవకాశం ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. అందుకోసమే కూల్చేసినట్టు తెలిపారు. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు అందించినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే కూల్చివేయాల్సి వచ్చిందని తెలిపారు.
అనుమతి తీసుకోకుండా సెట్ వేయడమే చిత్ర యూనిట్ చేసిన తప్పు అని, అనుమతులు కోరితే ఉచితంగానైనా పర్మిషన్ ఇచ్చి ఉండేవారమని అధికారులు పేర్కొన్నారు. సెట్ కూల్చివేతపై చిత్ర బృందం స్పందించలేదు. సెట్ కూల్చివేయడంతో ‘సైరా’ షూటింగ్కు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ మద్య సైరా నుంచి వరుసగా ఫోటోలు లీక్ అవుతుండటంపై కూడా చిత్ర యూనిట్ తలలు పట్టుకుంటుంది.