బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించే 'భారత్' సినిమాలో కథానాయికగా నటిస్తానని ముందుగా ఒప్పుకుని, ఆ తర్వాత 'అబ్బే, నాకు హాలీవుడ్ సినిమా వచ్చింది.. మీ సినిమా చేయలేను' అంటూ చిత్ర నిర్మాతలకు షాకిచ్చిన అందాలభామ ప్రియాంకా చోప్రాకు ఇప్పుడు హాలీవుడ్ నిర్మాతలు పెద్ద షాక్ ఇచ్చారు.  ఒక‌ప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్న ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం హాలీవుడ్‌కి పరిమితం అయింది. భార‌త్ అనే చిత్రంతో మ‌ళ్ళీ బాలీవుడ్‌కి తిరిగి వ‌స్తుంద‌ని అంద‌రు భావించిన‌, సెప్టెంబ‌ర్‌లో అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకుంటున్న కార‌ణంగా భార‌త్ నుండి త‌ప్పుకుంటున్న‌ట్టు అలీ అబ్బాస్ జాఫ‌ర్ ప్ర‌క‌టించారు. దీంతో ప్రియాంక స్థానంలో క‌త్రినాని తీసుకున్నారు.

Image result for priyanka chopra

హాలీవుడ్‌ మీడియా కథనం ప్రకారం, 'కౌబాయ్‌ నింజా వైకింగ్‌' సినిమా నిర్మాణం మరింత జాప్యం అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి  డైరెక్టర్‌ మిచెల్‌ మెక్‌లారెన్‌ స్క్రిప్టు డెవలప్‌ చేసే పనిలో ఉన్నారు. కానీ ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో కచ్చితంగా చెప్పలేమని కౌబాయ్‌ నింజా వికింగ్ నిర్మాతలు చెబుతున్నారు.  హాలీవుడ్ సినిమా న‌మ్ముకొని బాలీవుడ్  సినిమా ‘భరత్’ని వ‌దులుకున్న ప్రియాంక ఆశ‌లు ఆవిర‌య్యాయి. సెప్టెంబ‌ర్ త‌ర్వాత హిందీలో ఫర్హాన్‌ అక్తర్‌కు జోడీగా ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే చిత్రం చేయ‌నున్న‌ట్టు బాలీవుడ్ టాక్.

Image result for priyanka chopra

ఆమె హాలీవుడ్ సినిమా ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ విడుద‌ల‌కి సిద్ధం కాగా, ఏ కిడ్ లైక్ జేక్ చిత్రం సెట్స్ పై ఉంది. ఇక 'భారత్' సినిమాలో ప్రియాంకా చోప్రా తప్పుకోవటంతో ఆ అవకాశం కాస్తా కత్రినాను వరించిన విషయం తెలిసిందే.  ఏది ఏమైనా తన ప్రియుడిని త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ప్రియాంక ఇవన్నీ సీరియస్ గా పట్టించుకంటుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: