పాకిస్థాన్‌లో న‌టీమ‌ణులు హ‌త్య‌కి గురికావ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తుంది.  ప్రముఖ నటి, గాయకురాలు రేష్మ దారుణ హత్యకు గురికాగా, ఆమె భర్తే తుపాకితో కాల్చి చంపినట్టు అనుమానిస్తున్నారు. ఖైబర్ ఫక్తుఖ్వా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇటీవ‌ల ఓ సింగ‌ర్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెంద‌గా, తాజాగా న‌టి మ‌రియు సింగ‌ర్ రేష్మ భ‌ర్త చేతిలో దారుణ హ‌త్య‌కి గురైంది. 
Pakistani actress-singer Reshma shot dead, allegedly by husband
రేష్మ త‌న భ‌ర్త‌కి నాలుగో భార్య కాగా వారిద్ద‌రి మ‌ధ్య కొన్నాళ్ళుగా మ‌నస్ప‌ర్ధ‌లు తలెత్తాయి. ఈ క్ర‌మంలో రేష్మ గత కొన్నిరోజులుగా నౌషెరా కలాన్‌ లోని హకిమాబాద్‌లోని తన సోదరుడి ఇంట్లో ఉంటున్నారు.  గత కొంత కాలంగా వీరి మద్య మనస్పర్ధలు వస్తున్నాయి..దాంతో కొన్ని సార్లు గొడవలు కూడా జరిగాయి. దాంతో తన సోదరుడి వద్ద వచ్చి ఉంటున్న రేష్మ పై ఆమె భర్త అత్యంత దారుణంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో న‌టి రేష్మ కుప్ప‌కూలా ప్రాణాలు కోల్పోయింది.
Image result for pakistani singer actress reshma killed
నిందితుడిపై పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు. ఈ ఏడాదిలో ఇలా ఫీమేల్ ఆర్టిస్ట్‌ల‌పై దాడి జ‌ర‌ప‌డం ప‌దిహేనోది కాగా, ఫిబ్రవరి 3న ఆర్టిస్ట్‌ సంబల్‌ ఓ ప్రైవేట్‌ పార్టీలో హత్యకు గురైన విషయం విదితమే. పాకిస్థాన్ లో మహిళా కళాకారులను దారుణంగా హత్య చేసిన ఘటనల్లో ఇది 15వది. గాయనిగా మాత్రమే కాకుండా, పాకిస్థాన్ లో ఫేమస్ అయిన 'జోబల్ గోలునా'  డ్రామాలో నటించీ రేష్మ తన అభిమానులను మెప్పించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: