రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఆయనతో సినిమా అంటే హీరోలు, హీరోయిన్లు కూడా క్యూ కట్టేస్తారు. జక్కన్నతో ఓ సినిమా చేసిన వారికి ఆ తర్వాత మూవీ హిట్ అనేది డౌటేనని ఓ టాక్ కూడా ఉంది. ఇది నమ్మేలా ఇంతకుముందు రెండు మూడు ఎక్సాంపుల్స్ ఉన్నాయి. 


సింహాద్రి, యమదొంగ సినిమాల తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ హిట్ కోసం వేచి చూశాడట. అలాగే విక్రమార్కుడు మూవీ తర్వాత రవితేజ, ఛత్రపతి సినిమా తర్వాత ప్రభాస్ కూడా హిట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. రీసెంట్ గా బాహుబలి మూవీలో తన గ్లామర్ తో ఆకట్టుకున్న హీరోయిన్ తమన్నా పరిస్థితి కూడా అలాగే ఉందని అనుకుంటున్నారు.    


ఆమె విషయంలో సెంటిమెంట్ మాట ఎలా ఉన్నాగాని.. స్వయంకృపరాధం కూడా ఉందనే మాట వినిపిస్తోంది. బాహుబలి హిట్ తర్వాత తమన్నా రేంజ్ పీక్ స్టేజ్ కి వెళ్లింది. దీంతో రెమ్యూనరేషన్ కాస్తా పెంచేసింది. దాంతో భయపడిన నిర్మాతలు కాస్తా వెనకడుగు వేశారట. దీనికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన నా నువ్వే కూడా నిరాశపరచడంతో డిమాండ్ మరి తగ్గిపోయింది.    


ప్రస్తుతం తమన్నా దటీజ్ మహాలక్ష్మీ మూవీలో చేస్తోంది. ఈ సినిమా హిట్ అయితే మునుపటిలా అవకాశాలు వస్తాయని ఆశలు పెట్టుకుందట. రాజమౌళి చిత్రంలో చేస్తే ఎఫెక్ట్ పడటం మాట పక్కన బెడితే.. రెమ్యునరేషన్ పెంచి తనకు తానే ఎఫెక్ట్ అయిందని టాలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు. మరి తమన్నాకు దటీజ్ మహాలక్ష్మి ఒడ్డున పడేలా చేస్తుందా లేదా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం. 



మరింత సమాచారం తెలుసుకోండి: