టాలీవుడ్ లో అర్జున్ రెడ్డితో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు హీరో విజయ్ దేవరకొండ.  గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన సినిమా ‘గీతాగోవిందం’. ఈ మధ్య కాలంలో యూత్ ను విపరీతంగా  ఆకట్టుకున్న చిత్రంగా 'గీత గోవిందం' కనిపిస్తోంది.  ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజునే 16.40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, ఈ ఏడాదిలో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన టాప్ టెన్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది.

  గీత గోవిందం’ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చసాగుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ప్రేక్షకాదరణ పొందుతోంది. చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కెమిస్ట్రీ యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో తన జోరు చూపిస్తోంది. తొలి 5 రోజుల్లో ఈ సినిమా 55 కోట్ల గ్రాస్ ను .. 31కోట్ల షేర్ ను సాధించింది.  చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడం పట్ల అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో విడుదలైన ‘‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె’’ లిరికల్ సాంగ్ మరింత వేగంగా వ్యూస్ రాబడుతూ అరుదైన రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 5 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టిన పాటగా సరికొత్త రికార్డు నమోదు చేసింది.  5 లక్షల 25 వేలకు పైగా లైకులు కూడా కూడగట్టుకుందీ పాట. గోపిసుందర్ బాణీలు కట్టిన ఈ పాటను సిద్‌శ్రీరామ్ ఆలపించగా.. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: