కొండంత తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న జూనియర్ ఎంటీయార్ కి అతని సన్నిహితుడు, ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ బాసటగా నిలిచారు. తారక్ భయ్యా నీకు నేనున్ననంటూ అండగా నిలబడ్డారు. ఆ ఆవేదనలో నుంచి తొందరగా బయటకు రావాలని ఆకాన్స్ఖించారు. హరిక్రిష్ణ మ్రుతికి సంతాపం ప్రకటించారు.
అది ఆయనకే అంకితం :
‘డల్లాస్ కన్సర్ట్ను నందమూరి హరికృష్ణ గారికి అంకితం ఇస్తున్నానంటూ’ దేవిశ్రీ ప్రసాద్ హరికృష్ణకు నివాళులు అర్పించారు. హరికృష్ణ ఆకస్మిక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన డీఎస్పీ ఆయనతో గతంలో తాను దిగిన ఫొటోను కూడా ఈ రోజు ట్విటర్లో షేర్ చేశారు.
‘కొన్ని నెలల క్రితం ఆయనతో ఫొటో తీసుకున్నాను. ఎంతో ఆత్మీయత కలిగిన వ్యక్తి ఆయన. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్. తారక్ భయ్యా, కల్యాణ్రామ్ గారు మేమంతా మీకు తోడుగా ఉన్నాం. స్వర్గం నుంచి హరికృష్ణ గారు మనల్ని దీవిస్తూనే ఉంటారు. డల్లాస్ కన్సర్ట్ను ఆయనకు అంకితం చేస్తున్నానంటూ’ దేవిశ్రీ ట్వీట్ చేశారు.
మొత్తానికి గంపెడు దుఖంలో ఉన్న హరిక్రిష్ణ బిడ్డలను దేవిశ్రీ ఓదార్చడం ద్వారా తన మానవత్వాన్ని, స్నేహశీలతను చాటుకున్నారు. ఇంతకు ముందు దేవిశ్రీ నాన్నగారు సత్యమూర్థి చనిపోవడం జరిగింది. నాన్నకు ప్రేమతో సినిమా టైంలో జరిగిన ఆ విషాదంలోనూ దేవిశ్రీ ఓ పాటను కంపోజ్ చేసి తన తండ్రికి అంకితం ఇచ్చారు.