జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోవడం తో ఎన్టీఆర్ తీవ్ర దుఃఖం లోకి కూరుకు పోయాడు అయితే అతను నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాయిదా పడే అవకాశం ఉంది. జై లవకుశ` వంటి భారీ హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని చాలా గ్యాప్ తీసుకుని మరీ త్రివిక్రమ్ కథకు ఒకే చెప్పాడు. సినిమా ప్రారంభమైన నాటి నుంచి మొన్నటి వరకూ అంతా ప్లానింగ్ ప్రకారమే జరిగింది. షెడ్యూల్స్ లో ఎక్కడా మార్పులు రాలేదు.
దీంతో షూటింగ్ అనుకున్న టైమ్ లోనే పూర్తిచేయవచ్చని త్రివిక్రమ్ భావించాడు. అందుకే దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ చేయడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కానీ హరికృష్ణ మరణంతో త్రివిక్రమ్ ప్లాన్ లో మార్పులు తప్పవని తెలుస్తోంది. జూ.. ఎన్టీఆర్ ఇప్పుడు తండ్రి మరణించిన పుట్టెడు దుఖంలో ఉన్నాడు. ఆయనపరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. కనీసం రెండు నెలలు సమయం అయినా పట్టే అవకాశం ఉందని క్లోజ్ సోర్సెస్ చెబుతున్నాయి.
అంటే రెండు నెలల పాటు జూఎన్టీఆర్ పై షూట్ ఉండదు. కేవలం ఇతర ఆర్టిస్టులపై త్రివిక్రమ్ షూట్ చేసుకోవాలి. ఎన్టీఆర్ సెట్స్ కు వచ్చిన తర్వాత అతని సీన్స్ తీసుకుని వాటికి యాడ్ చేయాలి. లేదంటే తారక్ వచ్చే వరకూ అందర్నీ హోల్డ్ లో పెట్టాలి. అదే జరిగితే నిర్మాతకు భారీగా నష్టం వస్తుంది. కొందరి ఆర్టిస్టులకు డబుల్ పేమెంట్ ఇచ్చి మళ్లీ తీసుకురావాలి. టెక్నికల్ గాను సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.