యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడని చెప్పొచ్చు. బాహుబలి మొదటి రెండు పార్టులలో ప్రభాస్ నటనకు అందరు ఫిదా అయ్యారు. ఇక ఆ సినిమా తర్వాత సాహో సినిమా చేస్తున్నాడు ప్రభాస్ సుజిత్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.  


యువి క్రియేషన్స్ బ్యానర్ లో దాదాపు 150 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కూడా ప్రభాస్ యువి క్రియేషన్స్ బ్యానర్ లోనే సినిమా చేస్తారని తెలుస్తుంది.  


జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంటుందట. ఈ సినిమా సెప్టెంబర్ 6న ముహుర్తం పెట్టనున్నారట. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇంతకంటే గుడ్ న్యూస్ ఏదైనా ఉంటుందా చెప్పండి. చూస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కు వరుస సర్ ప్రైజులు ఇచ్చేలా ఉన్నాడు.  


ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సాహో సినిమా 2019 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న సాహో సినిమా భారీ అంచనాలతో వస్తుంది. బాహుబలి తర్వాత సినిమాగా వస్తున్న సాహో కూడా ఆ సినిమా నెలకొల్పిన రికార్డులను తిరగరాస్తుందని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: