బాలీవుడ్ సీనియర్ నటులు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ సంబంధిత ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న దిలీప్ కుమార్ ను ముంబైలోని లీలావతి ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం అక్కడి వైద్యలు ఆయనకు చికిత్స అదిస్తున్నారు. ఈ విషయాన్ని దిలీప్ కుమార్ అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నారు. దిలీప్ కుమార్ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేయాలని ఆ ట్వీట్ లో కోరారు. లీప్ కుమార్ ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేయాలని దిలీప్ కుమార్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఫైసల్ ఫారూకీ ట్వీట్ చేశారు.
ఆయన త్వరగా కోలుకొని సాధారణ స్థితికి రావాలని అభిమానులు ప్రార్థించాలని ట్వీట్ చేశారు. కాగా, దిలీప్ కుమార్ అసలు పేరు మహ్మద్ యూసుప్ ఖాన్. 1922 డిసెంబర్ 11న జన్మించారు. మొగల్-ఏ-అజమ్, నవ్యదౌర్, దేవదాస్, గంగా జమునా, కర్మ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను దిలీప్ కుమార్ ఏర్పరచుకున్నారు. ‘ట్రాజెడీ కింగ్’ గా పేరు సంపాదించుకున్న దిలీప్ కుమార్ 1998 నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. 1944లో తొలిసారి వెండితెరపై కనిపించిన దిలీప్ కుమార్.. ఐదు దశాబ్దాల సినీ జీవితంలో 50కి పైగా సినిమాల్లో నటించారు.
దేవ్దాస్, మొఘల్-ఏ-ఆజమ్, నయాదౌర్ చిత్రాలు ఆయనకు పేరు ప్రఖ్యాతిని తెచ్చిపెట్టాయి. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. గతంలో ఆయన ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. కానీ ఆయన భార్య, అలనాటి ప్రముఖ హీరోయిన్ సైరా బాను వాటిని ఖండించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో దిలీప్కుమార్ ఇబ్బంది పడుతున్నారు.