ప్రముఖ బెంగాలీ సినీ, టీవీ నటి పాయెల్‌ చక్రబోర్తి (38) మృతిచెందారు.   పాయెల్ చక్రబోర్తి బెంగాల్ లోని ఒక హోటల్ గదిలో అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే ఆమె భర్తతో విడాకులు తీసుకొని గత కొంత కాలంగా కొడుకుతో పాటు విడిగా ఉంటుంన్నట్లు సమాచారం. గదిలో దిగే ముందే తనను ఎవరు డిస్టర్బ్‌ చేయొద్దన్నారు. అంతేకాకుండా బుధవారం రాత్రిపూట భోజనం కూడా తీసుకోలేదు' అని హోటల్‌ సిబ్బంది తెలిపారు. దీంతో బుధవారం ఎంతగా డోర్‌ కొట్టినా తీయకపోవడంతో లోపలికి వెళ్లి చూస్తే అమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందన్నారు.  వెంటనే పోలీసులకి సమాచారాన్ని అందించగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

అయితే ఇప్పటివరకు ఈ కేసు కు సంబంధించిన వివరాలు తెలియలేదు. కాగా, నటి పాయెల్‌ సినిమాలు, టీవీ సీరియల్‌లు, పలు వెబ్‌ సిరీస్‌ల్లో నటించారు. చోఖేర్‌ తారా తుయ్‌, గొయెండా గిన్నీ వంటి షోలను కూడా ఆమె చేస్తున్నారు. పాయోల్‌ మృతి పట్ల పశ్చిమబెంగాల్‌ సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు సంతాపం వ్యక్తం చేశారు.  ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి మానసిక ఇబ్బందులే కారణం అయిఉండవొచ్చని అంటున్నారు.   

గత కొంత కాలంగా భర్తను వేరు గా ఉంటున్న ఆమె మానసికంగా కుంగిపోయిందని అంటున్నారు ఆమె సన్నిహితులు.  పాయెల్‌ మరణ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు సిలిగురి చేరుకొన్నారు. పాయెల్‌ రాంచి వెళుతున్నట్టు తనతో చెప్పిందని, ఇక్కడికి ఎందుకొచ్చిందో తనకు అర్థం కావడం లేదని ఆమె తండ్రి ప్రబిర్‌ గుహా తెలిపారు. పాయెల్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. అయితే పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతే హత్యా, ఆత్మహత్యా అనేది తేలుతుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: