టాలీవుడ్ లో టెంపర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ వరుసగా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ సినిమాలతో ఘనవిజయాలు అందుకున్నారు.  ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో  'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపాయి.  కాకపోతే ఈ మద్య ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ అనుకోకుండా నల్లగొండ జిల్లా అన్నపర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. 

దాంతో ‘అరవింత సమేత’ సినిమా షూటింగ్ ఆగిపోతుందని..ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవొచ్చు అని రూమర్లు వచ్చాయి.  కానీ ఎన్టీఆర్ మాత్రం అనూహ్యంగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి ప్రిపేర్ అయ్యారు.  తన వల్ల సినిమా ఆగకూడదని..నిర్మాతలకు ఎలాంటి నష్టం వాటిల్లడం తనకు ఇష్టం లేదని షూటింగ్ లో పాల్గొంటున్నారు.  ఈ సినిమా ఫ్యాక్షన్ తో ముడిపడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'అరవింద సమేత వీర రాఘవ' రూపొందుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారట.

ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.  ఈ సినిమాలో కమెడీ హీరో సునీల్ ముఖ్యపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.  దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ దిశగా చకచకా పనులు జరిగిపోతున్నాయి. అయితే ఎలాగూ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఆడియో రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నెల 20వ తేదీన ఆడియో వేడుకను హైదరాబాద్ లోని 'నోవాటెల్' హోటల్లో నిర్వహించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. సిరివెన్నెల .. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.  దీనికి సంబంధించి త్వరలో ఓ పోస్టర్ రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. 



మరింత సమాచారం తెలుసుకోండి: