ఒకప్పుడు సినిమా పాటలంటే మెలోడీ ప్రధానంగా ఉండేవి. అన్న ఎన్టీఆర్ నటించిన రోజులలో అయితే చెప్పనవసరం లేదు.  ఆ పాటలు తేనెల ఊటలు. మరి ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నపుడు ఆ తేనే పాటల తీపిని మరో మారు వినాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానిని ద్రుష్టిలో ఉంచుకుని ఆ సినిమాకు మేటి సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణిని ఎంపిక చేశారు



 ఇక కీరవాణి రంగంలోకి దిగాక ఊరుకుంటారా...మూవీని బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ గా చేయడానికి ప్రాణం పెట్టేస్తున్నారు.  ఎన్టీఆర్  మూవీలో పాటలను సీనియర్ సింగర్స్ చిత్ర, సునీతలతో పాడించడం ద్వారా ఆపాత మధురాలను మన ముందుకు కీరవాణి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సినిమా జీవితం అంతా ఉంటుంది. అలనాటి ఆణిముత్యాల లాంటి పాటలూ ఉంటాయి.



మరి అందుకో ఏ పాటకు పాడించారో కానీ చిత్ర, సునీతా కలసి లేటెస్ట్ గా ఓ పాట పాడారు. ఈ ఇద్దరూ తమ గానామ్రుతంతో ఎన్టీఆర్ కి ప్రానం పోస్తే కీరవాణి తన స్వరాలతో జీవం ఇచ్చారు. మొత్తానికి ఎన్టీఆర్  బయోపిక్ అద్భుతం  అమోఘం అనే రేంజిలో రెడీ అవుతోంది. 



బాలయ్య తన తండ్రికి ఇలపైకి దింపుతూంటే, అల్లుడు చంద్రబాబు గా రానా ఒదిగిపోయాడు. ఎన్టీఆర్ సతీమణి బసవతారం గా విద్యాబాలన్ నటిస్తే, శ్రీదేవిగా రకుల్ మెరియనుంది. ఎస్వీయార్ గా నాగబాబు అదరగొట్టనున్న ఈ మూవీ వచ్చె ఏడాది సంక్రాంతి  కన్నా ముందే వచ్చి తెలుగు లోగిళ్ళలో సంబరాలను తేనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: