తమిళ స్టార్ దర్శకులు శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో ‘రోబో’ సినిమా సెన్సెషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా దేశ వ్యాప్తంగానే కాకుండా..ప్రపంచ స్థాయిలో కూడా మంచి క్రేజ్ సంపాదించింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రోబో సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిదే. ఈ సినిమా ప్రాజెక్ట్ అనుకొని దాదాపు రెండేళ్లు దాటింది..అప్పటి నుంచి ఇదిగో..అదిగో అంటూ సాగదీస్తూనే వస్తున్నారు. పోస్టర్లు, ఆ మద్య వీడియో మేకింగ్ రిలీజ్ చేశారు. అంతకు మించి ఒక్క టీజర్ కూడా ఇప్పటి వరకు రాలేదు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2.0 టీజర్ మరికొద్ది రోజుల్లో వచ్చేస్తోంది. 2010లో రోబోకు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ టీజర్ లేటుగానే వస్తున్నా.. లేటెస్టుగా వస్తోంది. త్రీడీ హంగులతో విడుదలవుతోంది. ఈ విషయాన్ని ‘2.0’ విలన్ అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. 'వినాయకచవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 13వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నట్టు చెప్పాడు.
రజనీ అభిమానులందరికీ ఇది శుభవార్తేనని చెప్పాలి. ఈ టీజర్ తో శంకర్ ఏ స్థాయిలో అంచనాలు పెంచుతాడో చూడాలి. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, కథానాయికగా ఎమీ జాక్సన్ నటించిన సంగతి తెలిసిందే. ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నవంబరు 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది