శ్రీను వైట్ల డైరక్షన్ లో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న సినిమా అమబర్ అక్బర్ ఆంటోనీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీను వైట్ల ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే సినిమాలో మూడు పాత్రలు కనిపించినా అసలు ట్విస్ట్ ఏంటంటే ఒక్కడే ముగ్గురిగా కనిపిస్తాడట.


అదేంటి అంటే అదో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ వ్యాధితో ఒకే మనిషి మూడు పాత్రల్లో కనిపిస్తాడట. చూస్తుంటే ఇదేదో అపరిచితుడు సినిమాలానే అనిపిస్తుంది కదా.. శంకర్ అపరచితుడు సినిమా ఓ సోషల్ కాజ్ కోసం అలా కనిపిస్తాడు. మరి ఈ సినిమాలో శ్రీను వైట్ల ఎలాంటి కాజ్ చూపించాడో చూడాలి. 


అంతేకాదు బలమైన కథ కథనాలు ఉంటేనే ఇలాంటి సినిమాలకు మంచి స్కోప్ ఏర్పడుతుంది. కొన్నాళ్లుగా శ్రీను వైట్ల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో అమర్ అక్బర్ ఆంటోనీ అంటూ ఓ ప్రయోగం చేస్తున్నాడు. రవితేజతో శ్రీను వైట్ల ఇదవరకే వెంకీ, దుబాయ్ శీను సినిమాలు చేశాడు. 


ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి ఇప్పుడు ఈ ట్రిపుల్ 'A' సినిమా కూడా అదే విధంగా కామెడీ ఎంటర్టైనర్ గా నడిపిస్తున్నాడా లేక సీరియస్ సబ్జెక్ట్ తో వస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటిస్తుంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: