టాలీవుడ్ లో కొత్త దర్శకులు ఈ మద్య తమ టాలెంట్ తో స్టార్ హీదాలోకి వెళ్తున్నారు. విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమా తర్వాత అర్జున్ రెడ్డితో ఒకేసారి స్టార్ హోదా తెచ్చుకున్నాడు. ఈ మద్య రిలీజ్ అయిన ‘గీతా గోవిందం’ సినిమాతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు. నూతన దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండకు మంచి పొజీషన్ ఇచ్చాడు. అంతే కాదు సందీప్ వంగా దర్శకత్వంలో నటించడానికి ప్రముఖ హీరోలు సైతం సుముఖత తెలిపారు.
ప్రస్తుతం అర్జున్ రెడ్డి కోలీవుడ్, బాలీవుడ్ లో రిమేక్ అవుతుంది. హిందీ రీమేక్కు ఒరిజినల్కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ యువ కథానాయకుడు షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా తారా సుతారియా హీరోయిన్ గా నటించేందుకు ఓకె చెప్పారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
బాలీవుడ్ లో హీరోయిన్ గా తారకు చాన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి హీరోయిన్ కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ భామ టైగర్ ష్రాఫ్ సరసన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవటంతో అర్జున్ రెడ్డి రీమేక్కు డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేక పోతుందట. దాంతో ఈ సినిమా నుంచి తారను తొలగించారట.
కెరీర్ స్టార్టింగ్లోనే బోల్డ్ క్యారెక్టర్ చేయటం కరెక్ట్ కాదేమో అన్న ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ నుంచి తారా తప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా కోలీవుడ్కు పరిచయం అవుతున్నాడు. వర్మ పేరుతో తెరకెక్కుతున్న తమిళ వర్షన్కు బాల దర్శకత్వం వహిస్తున్నారు.