ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల ప్రముఖ నటులు, రాజకీయ నాయకులు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, హాస్యనటుడు రాకెట్ రామనాథన్ (74) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణించి వారం రోజులు కూడా కాలేదు..మరో తమిళ నాట మరో విషాదం చోటు చేసుకుంది. హాస్య నటుడు కోవై సెంథిల్‌(74) ఆదివారం ఉదయం కోవైలో కన్నుమూశారు.
పలు చిత్రాల్లో హాస్య పాత్రలతో పాటు, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించిన నటుడు కోవై సెంథిల్‌. కోవైలో నివశిస్తున్న కోవై సెంథిల్‌ ఇటీవల అనారోగ్యానికి గురై కోవైలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయన దర్శకుడు విక్రమన్‌ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. రజనీకాంత్‌ నటించిన పడయప్పా, కే.భాగ్యరాజ్‌ నటించి, దర్శకత్వం వహించిన ఇదునమ్మ ఆళు, వెంకట్‌ప్రభు తెరకెక్కించిన గోవా చిత్రాల్లో మంచి గుర్తింపు పొందాడు. స్వస్థలంలోనే ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతికి నడిగర్‌ సంఘం సంతాపం వ్యక్తం చేసింది.తనదైన శైలిలో హాస్యం పండించి తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఆయన అసలు పేరు కుమారస్వామి. కోవై సమీపంలోని వడవల్లి ఆయన స్వస్థలం.


మరింత సమాచారం తెలుసుకోండి: