టాలీవుడ్, కోలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ చియాన్ విక్రమ్. తాను నటించిన ప్రతీ సినిమాలోను ఎదో ఒక వెరైటీ చూపిస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాడు విక్రమ్. ఇటీవల గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధ్రువ నట్చత్తిరమ్’ అనే సినిమా పూర్తి చేశాడు. ఇందులో జాన్ అనే గూడా ఛారి పాత్రలో విక్రమ్ కనిపించాడు. ఇక విక్రమ్ ప్రస్తుతం సామికి సీక్వెల్ లో నటిస్తున్నాడు. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ సామి చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం హరి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
హరి లాంటి కమర్షియల్ దర్శకుడికి విక్రమ్ లాంటి హీరో తోడు కావడంతో ఔట్పుట్ ఏ స్థాయిలో వచ్చుంటుందో ఊహించుకోవచ్చు. పైగా హరి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ. ఆయన సినిమాలు కచ్చితంగా బాగుంటాయి అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. విక్రమ్ కూడా ఇదే కావాలంటున్నాడిప్పుడు. కొన్నేళ్లుగా ఈయనకు విజయాలు లేవు.
దాంతో "సామి 2"పైనే ఆశలన్నీ ఉన్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. యాక్షన్ పార్ట్ ఉన్నా కూడా క్లీన్ యు సర్టిఫికేట్ వచ్చింది. విక్రమ్ సరసన కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తుండగా, బాబి సింహా, ప్రభు, సూరి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. శిబు థామీన్స్ నిర్మాణంలో సామి2 రూపొందనుంది. దేవి శ్రీప్రసాద్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.
సినిమాటోగ్రాఫర్గా ప్రియన్, ప్రొడక్షన్ డిజైనర్గా మిలన్, స్టంట్ మాస్టర్గా కనల్ కన్నన్ సామి2 ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, ట్రైటర్ కి మంచి క్రేజ్ వచ్చింది. మొత్తానికి సామి 2 తో విక్రమ్ మరో విజయం ఖాయం అంటున్నారు అభిమానులు.