టాలీవుడ్ లో 35 ఏళ్ల క్రితం వచ్చిన ‘మంచుపల్లకి’సినిమాకు ఎంతో మంచి ఆదరణ వచ్చింది. ఒక యువతి కోసం కొంత మంది స్నేహితులు చేసిన త్యాగం, ప్రేమ, ఎమోషన్స్, సెంటిమెంట్ సీన్లతో అప్పట్లో సెన్సేషన్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి స్నేహితుడిగా, ప్రేమికుడిగా నటించి కన్నీరు పెట్టించారు. చిరంజీవికి స్నేహితుడిగా సాయిచంద్ నటించారు. అప్పట్లో కొన్ని సినిమాల్లో నటించిన సాయిచంద్ ఎంతో మంచి పేరు వచ్చింది. తర్వాత కాలంలో ఆయన సినిమాకు దూరంగా ఉంటూ వచ్చారు.
ఆ మద్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయిపల్లవి నటించిన ‘ఫిదా’సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో సాయిచంద్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, సాయిచంద్ 36 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో చిరంజీవి చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో సాయిచంద్ నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చిరంజీవికి సన్నిహితుడి పాత్రలో సాయిచంద్ కనిపిస్తారని తెలుస్తోంది.
ఇటీవల వీరిద్దరి కాంబినేషన్లో పలు సన్నివేశాలను కూడా తెరకెక్కించినట్లు సమాచారం. గతంలో వంశీ దర్శకత్వంలో రూపొందిన ‘మంచుపల్లకి’ చిత్రంలో చిరంజీవితో కలిసి నటించారు సాయిచంద్. దాదాపు 36 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి నటిస్తున్నారన్నమాట.బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.