యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది. పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈమధ్యనే ఈ సినిమా ఆడియో రిలీజ్ చేశారు.


ఆడియో ఆశించినంతగా లేదన్నది కొందరు వాదన. స్టార్ సినిమా పాటలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలుసు. అయితే అరవింద సమేతకు తమన్ 100 పర్సెంట్ న్యాయం చేసేందుకు కృషి చేసినా ఇంకా ఏదో కోరుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్. అదీగాక త్రివిక్రం తో తమన్ మొదటిసారి చేసిన సినిమా ఇది.


అయితే తమన్ బదులుగా అరవింద సమేతకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే వేరేలా ఉండేదని అంటున్నారు. త్రివిక్రం దర్శకత్వంలో సినిమా అంటే ముందు దేవి పేరు మాత్రమే వినిపించేది అజ్ఞాతవాసికి కొంత చేంజ్ కోసం అనిరుధ్ ను తీసుకొచ్చారు. అంతకుముందు చేసిన అ ఆకు కూడా మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించాడు.


అ ఆ మ్యూజికల్ గా హిట్ అయినా అజ్ఞాతవాసి మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే ముందు అరవింద సమేతకు అనిరుధ్ మ్యూజిక్ అనుకున్నా అతన్ని కాదని అతని ప్లేస్ లో తమన్ ను తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేసుంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: