ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ డూపర్ హిట్ అవగా.. సెకండ్ సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా బాధ్యతలను మీద వేసుకున్నాడు. 16 మంది సభ్యులతో మొదలైన బిగ్ బాస్ సెకండ్ సీజన్ చివరి వారానికి వచ్చేసింది. మరో మూడు రోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరో తెలుస్తుంది.


ప్రస్తుతం ఐదుగురు సభ్యులున్న బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్, గీతా మాధురు, తనీష్ ల మధ్య మంచి పోటీ ఉందని తెలుస్తుంది. దీప్తి నల్లమోతు కూడా టాప్ 3 లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కౌశల్ ఆర్మీ చేస్తున్న విపరీతమైన పబ్లిసిటీ కారణంగా కౌశలే టైటిల్ విన్నర్ అనేలా పరిస్థితులు కనడుతున్నాయి. 


కౌశల్ విన్నర్ అని అనే వారు కొందరుండగా కౌశల్ కాకుండా మిగతా వారిలో కూడా బిగ్ బాస్ విన్నర్ గా టైటిల్ గెలుస్తారని అంటున్నారు. కౌశల్ కాకుండా గీతా మాధురికి ఆ ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది. గీతా మాధురి మొదట్లో గేం ను లైట్ తీసుకున్నా తర్వాత తర్వాత సీరియస్ గా తీసుకుంది. 


ఒకానొక టైంలో కౌశల్ తో గీతా మాధురి ఢీ అంటే ఢీ అనేలా గొడవ జరిగింది. చూస్తుంటే కౌశల్ తో పాటుగా గీతాకి సమానంగా క్రేజ్ ఉందని అనిపిస్తుంది. బిగ్ బాస్ 1లో లాస్ట్ వీక్ దాకా వెళ్లి ఫైనల్ రేసులో వెనుకడుగు వేసిన అర్చన మాత్రం గీతా మాధురినే విన్న అనేస్తుంది. మరి అసలు విన్నర్ ఎవరన్నది ఆదివారం తెలుసుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: