సినిమా ఇండస్ట్రీలో ప్రకాశ్ రాజ్ అంటే ఎంత గొప్ప విలక్షణ నటుడో అందరికీ తెలిసిందే. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఏ పాత్ర పోషించినా దానికి 100 శాతం న్యాయం చేస్తారు.  ఆయన వ్యవహార శైలిపై నిత్యం ఏదో ఒక గాసిప్ వస్తూనే ఉంటుంది. తాజాగా ఆయన ఓ కమెడియన్‌పై చేయి చేసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది.  తాజాగా ప్రకాష్ రాజ్ గురించి సంచల వార్త వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. హీరో రామ్ నటిస్తున్న ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా సెట్ లో వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

 సైలెంట్‌గా ఉండమని

కమెడియన్ సప్తగిరిపై తీవ్రమైన వివాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.  రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా.. చుట్టూ దాదాపు వంద మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నప్పుడే ఆయన ఇలా చేశారట. ఈ ఘటనతో చిత్ర యూనిట్ షాకైందట. దిల్ రాజు కూడా అప్పుడు అక్కడే ఉన్నారట. ఈ ఘటన గురించి ఎవరూ ఎక్కడా మాట్లాడవద్దని దిల్ రాజు ఆదేశించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఘటనకు సంబందించిన వాస్తవాలు బయటకు రాలేదని ప్రచారం జరుగుతోంది. 


మొన్నటికి మొన్న అనుపమ పరమేశ్వరన్‌ను సెట్లో ప్రకాష్ రాజ్ తిట్టారని ఆమె బాగా బాధపడి కళ్లు తిరిగి పడిపోయిందని వార్తలు వచ్చాయి. అనంతరం మరికొన్ని సందర్భాల్లోనూ ఆయనపై ఇలాంటి అభియోగాలొచ్చాయి.  ఈ వార్తలను కూడా ప్రకాశ్ రాజ్ ఖండించారు. డైలాగ్ తప్పుగా చెబితే.. మరింత శ్రద్ధ పెట్టి పని చేయమని మాత్రమే చెప్పాను. తనకు ఒంట్లో బాగోలేకపోవడంతో ఎమోషనల్ అయ్యింది. 


తాజాగా ప్రకాష్ రాజ్ ఈ వార్తలపై స్పందించారు.  అలాంటిదేం జరగలేదన్నారు. అప్‌కమింగ్ నటుడైన సప్తగిరినేనేందుకు కొడతానని ఆయన ప్రశ్నించారు. మేం ఇద్దరం కలిసి ఓ సీన్లో నటించబోతున్నాం అని తెలిపారు. డైరెక్టర్‌గా అవతారం ఎత్తుతున్న అతడికి కంగ్రాట్స్ కూడా చెప్పానన్నారు.  అయితే ఈ వార్తపై సప్తగిరి మాత్రం ఎలాంటి కామెంట్ చేయకపోవడంతో ఇది నిజమేనని విషయం తెలిసిన ప్రేక్షకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: