యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం జరుగుతుంది. ఇక నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అరవింద సమేత ట్రైలర్ రిలీజ్ చేశారు. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఆ అంచనాలకు సరిగా కుదిరేలా ఈ ట్రైలర్ ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా కళ్యాణ్ రామ్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. 


ముఖ్యంగా సినిమా కోసం త్రివిక్రం మరింతగా తన పెన్నుని పదును పెట్టాడనిపిస్తుంది. సినిమా ట్రైలర్ లో నవరసాలను ఉంచి సినిమా స్థాయి ఏంటో చూపించారు. పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ట్రైలర్ లో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.


ఎన్.టి.ఆర్ లుక్స్ అదరగొట్టగా సినిమాలో ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం అంటూ రావు రమేష్ తో ఎన్.టి.ఆర్ చెప్పిన డైలాగ్ అదిరిపోయిందని చెప్పొచ్చు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా రాబోతుంది.


అక్టోబర్ 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఎన్.టి.ఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్న ఈ సినిమా మరోసారి తన సత్తా చాటేలా రికార్డుల వేట కొనసాగిస్తాడని చెప్పొచ్చు. మరి అరవింద సమేతతో ఎన్.టి.ఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: