ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ పేరు చెబితే..భారత దేశంలోనే కాదు ప్రపంచలో కూడా ఎంతో మంది అభిమానులు గుర్తుపడుతారు. ప్రియా ప్రకాశ్ వారియర్.. కన్నుగీటుతో కోట్లాది అభిమానుల హృదయాలని దోచుకొని ఓవర్ నైట్ స్టార్గా మారింది. ఈ పేరు అతి తక్కువ టైంలోనే అందరి నోళ్ళలో నానింది. ఓర చూపులతో కుర్రాళ్ళ గుండెల్లోకి బాణం దించిన ఈ మాలీవుడ్ బ్యూటీ తర్వాత పలు యాడ్స్ లో నటించింది. ఆ మద్య ప్రియాకు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో వరుసగా ఛాన్స్ లు వచ్చాయని వార్తలు తెగ హల్ చల్ చేశాయి.
అయితే నిఖిల్తో ప్రియా డెబ్యూ మూవీ ఉంటుందని వార్తలు రాగా, దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఆ కోరిక అక్కినేని అభిమానులకు తీరబోతుంది..కాకపోతే మూవీ పరంగా కాకుండా..ఈ కుర్ర భామ ఓ యాడ్ కోసం అఖిల్తో జతకట్టింది. ఇద్దరిని ఒకే ఫ్రేములో చూసే సరికి వీరిద్దరి కాంబినేషన్ చాలా బాగుందని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. అఖిల్, ప్రియాలని అతి త్వరలో వెండితెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా అక్కినేని అఖిల్ ‘మిస్టర్ మజ్ను’సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు.
తొలి ప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మద్య అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి సినిమాలు వరుసగా వచ్చాయి. నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు, సమంత నటించిన యూటర్న్, అక్కినేని నాగార్జున నటించిన దేవదాస్..మూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. మలయాళం సినిమా 'ఓరు అదార్ లవ్'లోని 'మానిక్యా మలారాయ పూవి' అనే సాంగ్లోని క్లిప్ వైరల్ గా మారడంతో ప్రియా ప్రకాశ్కి ఫుల్ పాపులారిటీ లభించిన సంగతి తెలిసిందే. వాలెంటైన్స్ డే స్పెషల్గా వచ్చిన ఈ వీడియో కుర్రకాళ్లు మతులు పోగొట్టింది.