బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ట్రిపుల్ ఆర్ అని ఎనౌన్స్ చేసిన నాటి నుండి మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు పెరిగాయి. చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి చేసే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు ఇద్దరి హీరోల ఫ్యాన్స్.


అసలైతే ఎన్.టి.ఆర్ అరవింద సమేత పూర్తి చేశాక రాజమౌళి సినిమాకు డేట్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే అనుకోకుండా ఈమధ్యనే హరికృష్ణ మరణంతో ఎన్.టి.ఆర్ ఢీలా పడ్డాడు. కమిట్ అయ్యాడు.. రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశాడు కాబట్టి అరవింద సమేత సినిమా పూర్తి చేసే దాకా షూటింగ్ చేశాడు.


తండ్రి మరణించిన బాధ ఉన్నా సినిమా కోసం 5వ రోజు నుండే షూటింగ్ చేశాడు. ఇక సినిమా ఎలాగు పూర్తయింది కాబట్టి ప్రస్తుతం రాజమౌళి సినిమాకు కొంత గ్యాప్ కావాలని అడుగుతున్నాడట ఎన్.టి.ఆర్. అయితే డిసెంబర్ నుండి ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్న రాజమౌళికి ఎన్.టి.ఆర్ డెశిషన్ సందిగ్ధంలో పడేసింది.


ఇప్పుడు ఎన్.టి.ఆర్ ను చేయమని ఇబ్బంది పెట్టదలచుకోవట్లేదు. అందుకే ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ మరింత వెనక్కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక చరణ్ కూడా బోయపాటి సినిమా పూర్తి చేసి రాజమౌళి సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తాడట. అప్పటి వరకు చరణ్ కూడా ఖాళీగా ఉంటాడని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: