‘ఛలో’, ‘గీతాగోవిందం’ లాంటి సినిమాలతో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక మందన కన్నడ భాషలో నటించి తెలుగు తెరకు పరిచయం అయ్యింది.  కన్నడంలో వచ్చిన కిర్రాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక   కిరిక్ పార్టి చిత్రీకరణ సమయంలో నటుడు రక్షిత్ శెట్టితొ పరిచయం ఏర్పడింది. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, మరియు జులై 2017లో వారి నిశ్చితార్థం జరిగింది.  2014 లో రష్మికా మోడలింగ్ ప్రారంభించింది. ఆమె అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది.   క్లీన్ & క్లియమ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. ఆ తరువాత ఆమె కిరిక్ పార్టి అనే కన్నడ చిత్రంలో నటించారు.

ఆ చిత్రంలో ఆమె నటనకుగాను ఆమె విమర్శకుల ప్రశంసలు పొందింది.  ఆ తరువాత ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర , గణేశ్ సరసన ఛమక్ అనే కన్నడ చిత్రాలలో నటించింది. నాగ శౌర్య కలసి ‘ఛలో’ సినిమాలో నటించింది.  ఇక పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘గీతాగోవిందం’సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకుంది.  ఆ తర్వాత నాగార్జున, నాని కాంబినేషన్ లో వచ్చిన ‘దేవదాస్’ సినిమాతో మరో ఘనవిజయం సాధించింది.  ఇలా వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తున్న రష్మిక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ గురించి ‘గీతాగోవందం’ సెట్స్ లో జరిగిన విషయాన్ని గురించి చెప్పింది. 

ఓసారి గీతగోవిందం షూటింగ్ స్పాట్ కు వెళ్లడం కొంచెం ఆలస్యం అయిందని రష్మిక తెలిపింది.   షూటింగ్ స్పాట్ కు కొంచెం ఆలస్యంగా వెళ్లడంతో సెట్ లో ఎవ్వరూ నాతో మాట్లాడలేదు. నేను పలకరించినా ఎవ్వరూ పట్టించుకోలేదు.  దాంతో నాకు ఎంతో బాధ అనిపించింది..సెట్లో ఓ మూలన కుర్చిలో కూర్చొని ఏడ్వటం మొదలు పెట్టాను.  వెంటనే దర్శకులు పరుశరామ్ అక్కడకు వచ్చి నన్ను ఆట పట్టించడానికే ఇలా చేశామని..అప్పటివరకూ నన్ను ఫాలో అవుతున్న కెమెరాను పరశురామ్ చూపించారు. అసలు నన్ను ఓ కెమెరా ఫాలో అవుతుందని అప్పటివరకూ నాకు తెలియలేదు  అని ఈ ఘటనను రష్మిక గుర్తుచేసుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: