హరికృష్ణ చనిపోవడం తో తీవ్ర వేధన అనుభవిస్తున్న ఎన్టీఆర్ అదే భాదతో అరవింద సమేత సినిమా ను ఫినిష్ చేసాడు. అయితే మరో మూడు రోజుల్లో అరవింద సమేత సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. టీజర్ ట్రైలర్‌లకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఈ సినిమాను చినబాబుతో కలిసి భారీ చిత్రంగా రూపొందించారు.

Image result for ntr and harikrishna

ఇక ఇటీవల జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎమోషనల్ స్పీచ్‌లు ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. దీంతో చిత్ర యూనిట్ చాలా ధీమాగా ఉంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ.. ఇటీవల మరణించిన తన తండ్రి హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ ఇంకా ఏమన్నాడంటే, అయితే నాన్న గారు పదే పదే ఓ మాట చెబుతూ ఉండే వారు. మరణానికి ఎవరూ అతీతులు కాదు.

Image result for ntr and harikrishna

అందరం క్షణికంగానే బతుకుతున్నాం అనేవారు. బహుషా ఆయన చనిపోతారని ముందే తెలిసిందేమో... అందుకే చనిపోవడానికి ముందు నాన్న ఫోన్ చేసి ఆయనకు ఇష్టమైన ‘పలావ్ తినాలని ఉంది. వండి పంపించు నాన్నా’ అన్నారు. అదే ఆయన చివరి కోరిక. నేను షూటింగ్ పూర్తైన వెంటనే ఇంటికి వచ్చి స్వయంగా పలావు వండి నాన్నకు పంపించా. ప్రతిరోజు మా గురించి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడమే కాకుండా ఆయన ఎక్కడకి వెళ్తున్నా.. అన్నయ్య కళ్యాణ్ రామ్‌కి నాకూ ఫోన్ చేసి చెప్పేవారు. కాని ఆ ప్రమాదం జరిగిన రోజు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు’ అంటూ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు ఎన్టీఆర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: