తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘సర్కార్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కు సంబంధించిన పోస్టర్లపై ఆ మద్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని ఆ మద్య వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, ప్రేమ్ కుమార్, యోగి బాబు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.
దసరా కానుకగా ఈ నెల 19న టీజర్ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సంవత్సరం విజయ్ నటించిన మెర్సల్ తెలుగు లో అదిరింది సినిమా ఎన్నో వివాదాల మద్య రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆపాలని ఓ వైపు డాక్టర్లు..బీజేపీ నాయకులు విపరీతమైన ప్రయత్నాలు చేశారు. అన్ని అవరోదాలు దాటి థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించడం మరో విశేషం.
గతంలో మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ‘కత్తి’ ఈ సినిమానే తెలుగు లో వివివినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’గా తీశారు. ఇదే కాంబినేషన్ లో ‘తుపాకీ’ కూడా ఘనవిజయం సాధించింది.
కాగా విజయ్, మురగదాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సర్కార్ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.