శ్రీకాకుళం జిల్లాలో వచ్చిన తిత్లీ తుఫాను వల్ల భారీ నష్టమే జరిగింది. 169 గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఈ తుఫాను బీభత్సానికి భారీ ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికే ఏపి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. కేంద్రం నుండి కూడా సాయాన్ని కోరింది. ఇక తిత్లీ తుఫాను బాధితుల కోసం సిని సెలబ్రిటీస్ కూడా మేమున్నామంటూ తమ సపోర్ట్ అందిస్తున్నారు.


లేటెస్ట్ గా అరవింద సమేత సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఎన్.టి.ఆర్ తిత్లీ తుఫాను బాధితుల కోసం 15 లక్షల సాయంగా సిఎం రిలీఫ్ ఫండ్ కు అందించారట. నందమూరి కళ్యాణ్ రాం కూడా 5 లక్షల రూపాయలను తిత్లీ తుఫాను బాధితుల కోసం సిఎం సహాయ నిధికి పంపించారట.


ఇప్పటికే సంపూర్ణేష్ బాబు తుఫాను బాధితుల కోసం 50 వేలు ప్రకటించారు. విజయ్ దేవరకొండ కూడా 5 లక్షల ఆర్ధిక సాయం అందించారని తెలుస్తుంది. ఈమధ్య కేరళలో వచ్చిన వరదల కోసం సిని హీరోలు తమకు తోచిన సహాయం చేశారు. ఇక ఇప్పుడు తిత్లీ వల్ల భారీగా నష్టపోయిన శ్రీకాకులం జిల్లా కోసం స్టార్స్ కు విరాళాలు ఇస్తున్నారు. 


ప్రస్తుతానికి ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం, విజయ్ దేవరకొండ మాత్రమే విరాళాలు ప్రకటించారు. అరవింద సఏతం సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న ఎన్.టి.ఆర్ తిత్లీ తుఫాను వల్ల జరిగిన నష్టం గురించి తెలుసుకుని వెంటనే విరాళం ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: