టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ ’బయోపిక్.  ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకులు క్రిష్ ప్రకటించిన విషయం తెలిసిందే.  జనవరి 9 ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, జనవరి 24 న‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిలీజ్ చేయబోతున్నట్లు దానికి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేశారు.  ఇప్పటి వరకు పోస్టర్లు , క్యారెక్టర్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేస్తూ వచ్చారు దర్శకలు క్రిష్.   తాజాగా దీపావళి సందర్భంగా నందమూరి అభిమానులకు మరో ట్రీట్ ఇచ్చేందుకు దర్శకుడు క్రిష్ రెడీ అవుతున్నాడు.
Image result for క్రిష్ ఎన్టీఆర్ మహానాయకుడు
సంక్రాంతి బరిలో ఇతర సినిమాలు ఉన్నా... ఎన్టీఆర్ సినిమాపైనే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చిత్రి యూనిట్ భావిస్తోంది. అందుకే ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని నిర్ణయించుకుంది.  సంక్రాంతి, రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్టీఆర్ రెండు భాగాలను విడుదల చేయాలని భావిస్తున్న చిత్ర యూనిట్.  ఈ నేపథ్యంలో సినిమాపై మరింత ఫోకస్ తీసుకు రావడానికి  దీపావళికి రెండు టీజర్లను విడుదల చేయబోతోంది. ఉదయం ఎన్టీఆర్... కథానాయకుడు, సాయంత్రం ఎన్టీఆర్... మహానాయకుడు టీజర్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. 
Related image
ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఏ స్టిల్ విడుదల చేసినా... రెండు స్టిల్స్ రిలీజ్ చేయడం సెంటిమెంట్‌గా మార్చుకున్నాడు క్రిష్. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌తో పాటు నాగేశ్వరరావుగా సుమంత్ ఫస్ట్ లుక్, శ్రీదేవిగా రకుల్ ఫస్ట్ లుక్ విషయంలోనూ సేమ్ సెంటిమెంట్‌ను ఫాలో అయ్యాడు. ఇక నందమూరి బాలకృష్ణమైన సంక్రాంతి పడుగకు ప్రతి సినిమా రిలీజ్ చేయడం సెంటిమెంట్ గా భావిస్తుంటారు. 
Related image
ఈ నేపథ్యంలో మరోసారి ఆయన రెండు భాగాలు గా వస్తూ..ప్రత్యేక చాటబోతున్నట్లు ఫ్యాన్స్ తెగ సంబరంలో ఉన్నారు.  ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమా రెండు భాగాలకు సంబంధించిన రెండు టీజర్లను ఒకేసారి విడుదల చేసి... సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: