ఇప్పుడు భారత దేశంలో ‘మీటూ’ ఉద్యమం కొనసాగుతుంది.  సంఘంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం విప్పాలని..మహిళలు చేసే ఆయా రంగాల్లో పురుషుల వల్ల కలుగుతున్న లైంగిక ఇబ్బందులు ఎదుర్కొవాలని..అలాంటి సమస్యలు ఏవైనా ఉంటే బహిరంగంగ చెప్పాలని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకు వస్తున్నారు.  తాజాగా బాలీవుడ్ లో మీటూ ఉద్యమం పై తనూశ్రీ దత్తా, కంగనా మాట్లాడితే..దక్షిణాది ఇండస్ట్రీ నుంచి సింగర్ చిన్మయి తన గొంతు విప్పింది. అంతే కాదు ప్రముఖ రచయిత వైర‌ముత్తు పై సంచలన ఆరోపణలు కూడా చేసింది. 

గతంలో తనను రూమ్ లోకి ఒంటరిగా పిలిచి కౌగిలించుకొని అసభ్యంగా ప్రవర్తించారని..ఆయన వ్యక్తిత్వం మంచిది కాదని ఆరోపించింది. వెకిలి చేష్ట‌ల‌తో ఆ యువ‌తిని భ‌య‌బ్రాంతుల‌కి గురి చేశాడ‌ని ఆరోపించింది చిన్మయి.  కాగా, ప‌ద్మభూష‌ణ్ అవార్డుతో పాటు ప‌లు జాతీయ అవార్డులు అందుకున్న ర‌చ‌యిత వైర‌ముత్తు. ఎన్నో విజ‌యవంత‌మైన చిత్రాలకి పాట‌లు రాసిన వైర‌ముత్తుపై ఇటీవ‌ల అనేక లైంగిక ఆరోప‌ణ‌లు వచ్చిన సంగ‌తి తెలిసిందే.   
Image result for chinmay allegation vairamuttu
దీనిపై స్పందించిన  ర‌చ‌యిత వైర‌ముత్తు నాపై వస్తున్న ఆరోపణలు అన్ని అబద్ధాలు. అవి నిజమైతే.. ఆ మహిళలు నాపై కేసు పెట్టొచ్చు. చట్టపరంగా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను మంచివాడినో, చెడ్డవాడినో ఒకరు చెప్పనక్కర్లేదు. న్యాయస్థానమే దాన్ని నిర్ణయిస్తుంది. కోర్టు తీర్పును నేను స్వాగతిస్తాను అని అన్నారు. అయితే వైరముత్తుకు పరోక్షంగా పలువురు సెలబ్రెటీలు మద్దతు పలకడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: