మళయాల ప్రేమం సినిమాతో ఒక్క భాషలో సినిమా చేసి సౌత్ లో యువత మనసులు దోచేసిన సాయి పల్లవి. తెలుగులో ఫిదా అంటూ వచ్చి తెలుగు ఆడియెన్స్ ను ఫిదా అయ్యేలా చేసింది. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా చేశాడు. ఫిదా తర్వాత సాయి పల్లవి ఎం.సి.ఏ సినిమాతో హిట్ అందుకుంది సాయి పల్లవి.


సినిమా సెలక్షన్స్ లో ఆచి తూచి అడుగులేస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం శర్వానంద్ హీరోగా పడి పడి లేచే మనసు సినిమా చేస్తుంది. హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమా చేస్తుండగానే మరో రెండు ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది.


లేటెస్ట్ గా సాయి పల్లవి ఓ మల్టీస్టారర్ ఆఫర్ ను కాదన్నదని తెలుస్తుంది. స్టార్ డైరక్టర్ హరీష్ శంకర్ డైరక్షన్ లో మల్టీస్టారర్ మూవీగా అనుకుంటున్న దాగుడు మూతలు సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని అడిగితే సారీ అనేసిందట. కథలో హీరోయిన్ కు అంత ప్రాధాన్యత లేకపోవడం వల్ల సాయి పల్లవి ఆ సినిమా వదులుకుందట.


దాగుడు మూతలు సినిమాను దిల్ రాజు నిర్మిస్తారని అనుకోగా కథలో మార్పులను సూచించగా అందుకు ఇష్టం లేని హరీష్ శకర్ 14 రీల్స్ బ్యానర్ లో ఈ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. శర్వానంద్, నానిలు ఈ సినిమాలో హీరోలుగా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: