టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ హవా కొనసాగుతున్న ఈ తరుణంలో సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీ క్యాన్సిల్ అయ్యిందని తెలుస్తుంది. అదేంటి మల్టీస్టారర్ మూవీ క్యాన్సిల్ అవడమా అది కూడా ఇద్దరు స్టార్స్ కలిసి చేసే ఆ సినిమా ఎందుకు ఆగిపోతుంది అంటే ఇటీవల వచ్చిన ఓ మల్టీస్టారర్ మూవీ చూసిన ఆ సినిమా రిజల్ట్ అంత సాటిస్ఫైడ్ గా అనిపించలేదు కాబట్టి అదే తరహాలో వచ్చే ఈ సినిమా కూడా అలాంటి రిజల్టే వస్తుందన్న భావనతో ఆపేస్తున్నారట.


ఇంతకీ ఏ సినిమా గురించి ఈ వార్త అంటే. ఇంకె సినిమా మామా అల్లుళ్లు కలిసి చేసే వెంకీ మామా సినిమా గురించి అని తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి చేయబోయే క్రేజీ మల్టీస్టారర్ మూవీ సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే సినిమా క్యాన్సిల్ అవుతుందని అంటున్నారు. 


ఈమధ్య నాగార్జున, నానిలు కలిసి చేసిన దేవదాస్ సినిమా ఎన్నో భారీ అంచనాలతో వచ్చినా ఫలితం నిరాశ పరచింది. అందుకే బాబి డైరక్షన్ లో తీయాలనుకున్న వెంకీ, చైతు మల్టీస్టారర్ సినిమా కూడా స్క్రిప్ట్ సోసోగానే ఉందట. దానితో సూపర్ హిట్ కష్టమని నిర్మాతలు వెనక్కి తగ్గారట.


ఈ సినిమా సురేష్ బాబు, కోనా వెంకట్ కలిసి నిర్మించాలని అనుకున్నారు కాని బాబి కథ అంతంతమాత్రంగానే ఉండటంతో సినిమా వద్దనుకున్నారట. ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్-2 సినిమా చేస్తున్నాడు అందులో వరుణ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. మరి వెంకీ మామా క్యాన్సిల్ అవడం దగ్గుబాటి, అక్కినేని ఫ్యాన్స్ కు చేదు వార్తే అని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: