రాజమౌళి మల్టీ స్టారర్ సినిమా కోసం ఇప్పడూ దేశం ఎదురు చూస్తుంది. మొదటసారిగా మెగా నంద మూరి హీరోలు నటిస్తుండటం తో అంచనాలు తారా స్థాయికి చేరినాయి. సౌత్ లో రూపొందుతున్న అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రం ఇది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రం ప్రకటించి చాలా కాలం అవుతున్నా ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు ఈ చిత్రానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది.

ముహూర్తం అప్పుడే

ముందు నుంచి ఈ చిత్రం నవంబర్ లో కానీ, డిసెంబర్ లో కానీ ప్రారంభం అవుతుందని వార్తలు ప్రచారం అయ్యాయి. తాజగా ఈ చిత్రానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. నవంబర్ 5న పూజా కార్యక్రమాలతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారట. ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇద్దరూ విభిన్నంగా

 అందులో ఒక హీరోయిన్ గా ఫారెన్ బ్యూటీని ఎంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రం ప్రారంభమయ్యాక కాస్టింగ్ గురించి పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఎప్పటిలాగే రాజమౌళి చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. బాహుబలి చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఈ చిత్రానికి కూడా కెమెరా భాద్యతలు నిర్వహిస్తారు. ఈ చిత్రంలోని ఇంటర్వెల్ సన్నివేశాన్నే 45 రోజుల లాంగ్ షెడ్యూల్ లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. కళ్ళు చెదిరేలా యాక్షన్ ఎపిసోడ్స్ రూపొందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాహుబలి తరువాత రాజమౌళి సినిమాపై అంచనాలు విపరీతంగా పెరగడం ఖాయం. ఆ అంచనాలని అందుకునే విధంగా రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: