తమిళనాట సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మికి రహస్య నిశ్చితార్థం జరిగింది… అంటూ టాలీవుడ్, కోలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం వరలక్ష్మి 'సర్కార్', 'సండైకోళి2', 'మారి2', 'నీయా2', 'వెల్వెట్ నగరం' లాంటి సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటున్న వరలక్ష్మి గురుంచి వస్తున్న ఈ వార్త తన అభిమానులకు కూడా షాకిచ్చింది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని సమాచారం. అయితే వీరి వివాహానికి శరత్ కుమార్ సుముఖంగానే ఉన్నప్పటికీ......శరత్ కుమార్తో వియ్యమొందడానికి విశాల్ తండ్రి జి.కె.రెడ్డి సుముఖంగా లేరని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇరు కుటుంబాల మధ్య రాజీకుదర్చి వివాహానికి ఒప్పించేందుకు వరలక్ష్మి సవతి తల్లి, నటి రాధిక రాయబారం నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విశాల్-వరలక్ష్మి మాత్రం తమ పెళ్లి విషయమై వస్తున్న వార్తలను ఖండిస్తున్నారు. తాజాగా విశాల్ తో తన పెళ్లిపై వస్తున్న వార్తలపై వరలక్ష్మి శరత్ కుమార్ స్పందిస్తూ..విశాల్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే అని గతంలో చాలాసార్లు చెప్పాను. మేము ప్రేమించుకోలేదు .. డేటింగ్ చేయలేదు. విశాల్ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడనే వార్తలు నేను విన్నాను. ఆయన పెళ్లి చేసుకుంటే నాకూ సంతోషమే అని చెప్పుకొచ్చింది.
అంతే కాదు ప్రస్తుతం తాను నటించిన 'సండైకోళి2' తెలుగులో పందెం కోడి 2 మంచి విజయం సాధించిందని.. తాను 'సర్కార్' సినిమాలోను కీలకమైన పాత్రలో కనిపిస్తానని అన్నారు. ఈ సినిమాలోని పాత్ర కూడా తనకి మంచి పేరు తీసుకు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. చాలా తక్కువ సమయంలో రెండు భారీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్నందుకు చాలా ఆనందంగా వుందని అంది. సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్లు సహజంగానే వస్తుంటాయని..వాటన్నింటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు వరలక్ష్మి.