యువ హీరోలంతా ప్రస్తుతం రొటీన్ కు భిన్నంగా ప్రయోగాల వెంట పడ్డారు. ఆడియెన్స్ కూడా కొత్తగా ట్రై చేస్తున్న వారికే క్రేజ్ తెస్తున్నారని గుర్తించిన హీరోలు వరుస ప్రయోగాలకు సిద్ధం అవుతున్నారు. అయితే ప్రయోగం అంటే కేవలం సినిమా ప్రమోషన్స్ కు వాడేందుకు మాత్రమే కాదు సినిమా కంటెంట్ కూడా బలంగా ఉండాలి. 


లేటెస్ట్ గా నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చిన సవ్యసాచి ప్రయోగం అంటూ ప్రమోట్ చేశారు. చెప్పడానికి ఇది ఓ ప్రయోగాత్మక సినిమానే కాని అది సరిగా వాడుకోలేదని చెప్పాలి. హీరో ఒకడే కాని అతని ఎడమ చేతిలో మరో మనిషి ప్రాణం ఉంటుంది. ఇదవరకు ఎక్కడ కనని వినని సబ్జెక్ట్.


కార్తికేయ లాంటి సినిమా చేసి ప్రతిభ చాటిన చందు మొండేటి ఈ సినిమా తప్పకుండా బాగా హ్యాండిల్ చేసి ఉంటాడని భావించారు. కాని చందు కూడా తేలగొట్టేశాడు. హీరోకి ఉన్న ఆ స్పెషల్ ఎఫెక్ట్ ను కథలో బలవంతంగా పెట్టాడని అనిపిస్తుంది తప్ప దాని వల్ల సినిమాకు ప్లస్ అవలేదు. అంచనాలకు అందుకోలేని సవ్యసాచి జస్ట్ యావరేజ్ సినిమాగా మిగిలింది. మైత్రి మూవీ మేకర్స్ ను డిజప్పాయింట్ చేసిన మొదటి సినిమా ఇదే కావొచ్చు.


అయితే సినిమాకు ఏర్పడిన పాజిటివ్ బజ్ దృష్ట్యా మొదటి రోజు 3 కోట్లు పైగా వసూళ్లను రాబట్టింది. చైతు కెరియర్ లో మూడవ హయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్టెడ్ మూవీ సవ్యసాచి. శైలజా రెడ్డి అల్లుడు, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలు వీటిలో ముందున్నాయి. పాతిక కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన సవ్యసాచి ఫుల్ రన్ లో ఎంత తెస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: