తన కెరియర్ లో 25వ చిత్రమైన మహర్షి సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇండస్ట్రీ లో  భారీ నిర్మాతలు అయిన దిల్ రాజు మరియు అశ్వినీ దత్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇటీవల యూఎస్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

Image result for maharshi cinema

సినిమాకి సంబంధించిన చాలా చిత్రీకరణ అమెరికాలో కానీ చేశాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రాముఖ్యమైన సన్నివేశాలు కొన్ని మిగిలి ఉండటంతో హైదరాబాద్ నగరంలో పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించడానికి సినిమా యూనిట్ సిద్ధమైనట్లు సమాచారం.

Related image

సినిమాకు సంబంధించిన కీలకమైన ఈ సన్నివేశాలలో  అల్లరి నరేశ్ .. పూజా హెగ్డే నటిస్తున్నారట. డిసెంబర్లో జరిగే పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తికానుంది. ప్రకాశ్ రాజ్ .. జయసుధ కీలకమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను, ఏఫ్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.

Image result for mahesh pujahedhe

వేసవి కానుకగా విడుదల కాబోతున్న 'మహర్షి' సినిమా పై భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు మహేష్ అభిమానులు. మహేష్ విడుదల అయిన  చివరి సినిమా 'భరత్ అనే నేను' ఇండస్ట్రీ హిట్ అవడంతో..రాబోతున్న 'మహర్షి' కూడా అదే స్థాయిలో హిట్టు కొడుతుందని తమ ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు మహేష్ అభిమానులు.



మరింత సమాచారం తెలుసుకోండి: