టాలీవుడ్ లో నయా ట్రెండ్ ఒకటి బయోపిక్ సినిమాలు కాగా.. మరో ట్రెండ్ మల్టీస్టారర్ మూవీస్. ఈమధ్య వరుసగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నారు మన స్టార్స్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా దీనికి నాంధి పలికిందని చెప్పొచ్చు. ఇదిలాఉంటే ఇప్పుడు సెట్స్ మీద దాదాపు నాలుగైదు మల్టీస్టారర్ సినిమాలు ఉన్నాయి.


వీటిలో రాజమౌళి మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమా కూడా ఉండటం విశేషం. ఎన్.టి.ఆర్, చరణ్ అది కూడా రాజమౌళి డైరక్షన్ లో ఇక ఈ సినిమా అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నవంబర్ 11న అంటే ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ మొదలవనుంది.    


డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కథ, కథనాల మీద కేవలం రాజమౌళి ఒక్కడికే క్లారిటీ ఉందట. సినిమాలో నటిస్తున్న స్టార్స్ ఎన్.టి.ఆర్, చరణ్ లకు ఈ సినిమా స్క్రిప్ట్ తెలియదట. తాను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే చాలని సలహా ఇచ్చాడట. కాకపోతే ఆహార్యం విషయంలో మాత్రం కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చాడట.


సో ఏరోజు షూట్ ఆరోజు ఎన్.టి.ఆర్, చరణ్ లకు కొత్తే అన్నమాట. సీన్ సీన్ కు ఆడియెన్స్ లానే వారు కూడా చేసేప్పుడు సర్ ప్రైజ్ అవుతారని చెప్పొచ్చు. అంతేకాదు ఈ ట్రిపుల్ ఆర్ కు ఎన్.టి.ఆర్, చరణ్ లకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వడం లేదట. బిజినెస్ లో షేర్ మాట్లాడుకున్నారని తెలుస్తుంది. మొత్తానికి బాహుబలి తర్వాత రాజమౌళి అంచనాలకు తగిన సినిమానే సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: