ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ అది కూడా రాజమౌళి లాంటి క్రేజీ డైరక్టర్ చేస్తున్నాడు అంటే ఆ సినిమాకు ఇక ఆశాకాన్నంటే అంచనాలు ఉంటాయి. బాహుబలి తర్వాత రాజమౌళి ఈ ప్రెస్టిజియస్ సినిమాకు ఈరోజు ముహుర్తం పెడుతున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా ట్రిపుల్ ఆర్ అంటూ ఎనౌన్స్ చేశాడు మన జక్కన్న.


రాజమౌళి, రాం చరణ్, రామారావు అంటూ ముగ్గురు పేర్ల మొదటి అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్.ఆర్.ఆర్ అంటూ అంచనాలు పెంచాడు. అయితే సినిమా మొదలు పెడుతున్న సందర్భంగా మీడియాకు కొన్ని లీకులు వచ్చాయి. ఈ సినిమా టైటిల్ గా రామ రావణ రాజ్యం అని పెట్టబోతున్నారట.


ఇందులో రాముడిగా రాం చరణ్, రావణ్ గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నాడని టాక్. ఎన్.టి.ఆర్ జై లవ కుశ సినిమా చూశాక రాజమౌళికి ఈ థాట్ వచ్చి ఉండొచ్చు. అందులో ట్రిపుల్ రోల్ చేసిన ఎన్.టి.ఆర్ రావణ్ పాత్రకు అద్భుతమైన నటన కనబరిచాడు. అందుకే ట్రిపుల్ ఆర్ లో ఎన్.టి.ఆర్ కు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఇస్తున్నాడని తెలుస్తుంది.


అయితే టైటిల్ ప్రకారం చూస్తే మల్టీస్టారర్ సినిమాలో హీరో రాం చరణ్ అన్నది అర్ధమవుతుంది. మరి రాజమౌళి ఏం చేస్తాడో ఏమో కాని ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యేలా ఈ ట్రిపుల్ ఆర్ ఎలా తీర్చిదిద్దుతాడో చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: