టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న  '2.ఓ' ఈ నెల 29 న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.  వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా..కొన్ని టెక్నికల్ ఇబ్బందుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఒకదశలో బయ్యర్లు విసిగిపోయి..ఈ సినిమా వస్తుందో రాదో అన్న అనుమానం కలగడం..ఇచ్చిన డబ్బు వాపస్ తీసుకోవడం కూడా జరిగింది.  అయితే డైరెక్టర్ శంకర్ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా అన్ని విధాలుగా ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించారు. 
Image result for 2.0 posters
రూ.550 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరెక్కించినట్లు తెలుస్తుంది.  ఈ సినిమాకు సంబంధించి  టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తున్నాయి.  ఇక ఈ సినిమాకు అస్కార్ అవార్డు గ్రహీత సంగీత మాంత్రికుడు ఎ.ఆర్. రహమాన్ స్వరాలు సమకూర్చారు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాటు దుమ్మురేపుతున్నాయి.  తాజాగా తెలుగు వెర్షన్ కి సంబంధించిన లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
Related image
"నా ప్రియమౌ ప్రియమో బ్యాటరివే విడిచి వెళ్లిపోవద్దే .. నా ప్రియమౌ ప్రియమో బ్యాటరివే అసలేం తరగొద్దే .. యంతర లోకపు సుందరివే .. అంకెల కవితలు సెండుదువే" అంటూ ఈ పాట కొనసాగుతోంది. ఈ పాటలో కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించిన పదాలను ఎక్కువగా ఉపయోగిస్తూ రాశారు. రోబోస్ రూపంలోని నాయకా నాయికలు పాడుకునేదిగా ఈ పాటను ట్యూన్ చేశారు. అంతే కాదు  'నీ బస్ కి కండక్టర్ నే' అనే లైన్ రజనీ అభిమానులను ఉత్సాహ పరుస్తుంది. ఎందుకంటే రజనీ సినిమాల్లోకి రాకముందు బస్ కండక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: