తెలుగు చలన చిత్ర రంగం స్వర్ణ యుగాన్ని చూసింది. అప్పట్లో నందమూరి తారకరామారావు, సావిత్రి జంట తెలుగు జనం కన్నుల పంటగా ఉండేది. ఇద్దరూ కలసి ఎన్నో మూవీస్ చేశారు. అన్నీ క్లాసిక్స్. అన్నీ సూపర్ సక్సెస్. వెండి తెర వారి అభినయం చూసి పులకరించి పోయింది. ఇద్దరూ ఇపుడు అమరులైనా వారి జీవిత చరిత్రలే తెలుగు సినిమాకు కధా వస్తువులయ్యాయి. మహానటి సినిమా విజయవంతమై సావిత్రిని తెలుగు లోగిళ్ళలో మరో మారు తీసుకువచ్చింది. అన్న గారి బయోపిక్ తొందరలో జనాల్లోకి రానుంది.


ఇవన్నీ ఇలా ఉంటే తెలుగు సినిమా జక్కన్న రాజమౌళి లేటెస్ట్ సెన్షేషన్ ఆర్ ఆర్ ఆర్ లో జూనియర్ ఎంటీయార్, రాం చరణ్ కలసి తొలిసారి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రేర్ కాంబినేషన్ లో ఎన్నో సెన్షేషన్లు వండి వార్చుతున్నాడు జక్కన్న. ఈ మూవీ కోసం ముగ్గురు అందాల భామలను  సెలెక్ట్ చేసే పనిలో రాజమౌళి ఇపుడు బిజీగా ఉన్నారు.  జూనియర్ నందమూరి పక్కన జోడీగా అపర సావిత్రి గా కనిపించి మెప్పించిన మహా నటి కీర్తి సురేష్ ని ఎంపిక చేశారట. దాంతో ఈ జోడీ అదుర్స్ అంటూ అపుడే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.


అసలు నందమూరి వారసుడు జూనియర్ అయితే, అలనాటి సావిత్రికి ప్రతిబింబంలా కీర్తి సురేష్ ఉన్నారు. మరి ఈ ఇద్దరి జంట అలనటి తారాకరాముడు, సావిత్రిల మాదిరిగా కన్నుల పంట అవుతుందా అన్న ఆసక్తి జనాల్లో పెరుగుతోంది. ఇద్దరు అందమైన వారు, ధీటైన అభినయం ఉన్న వారు. ఇక తీర్చిదిద్దేందుకు జక్కన పక్కన ఎటూ ఉన్నారు. సో ఈ పెయిర్ సూపర్ అంటున్నారు. ఇక చూడాల్సింది చరణ్ పక్క‌న సరి జోడీని. ఆ న్యూస్ కూడా తొందరలోనే జక్కన్న రివీల్ చేస్తాడట. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ ప్రభంజనం స్రుష్టించేలాగే  కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: