మాస్ దర్శకులు బోయపాటి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్  హీరోగా 'వినయ విధేయ రామ' నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే.  చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు.  ఈ టీజర్ లో బోయపాటి మార్క్ చూపిస్తూ..పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు పూర్తి యాక్షన్ సీన్లు చూపించారు.  రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాంచరణ్ కి మరో సూపర్ హిట్ ఖాయం అన్న విధంగా ఉంది టీజర్.  బోయపాటి సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ తో పాటు పక్కా మాస్ సాంగ్స్ కూడా ఉంటాయని తెలుసు...అంతే కాదు తెలుగు ఆడియన్స్ కోరుకునే విధంగా ఐటమ్ సాంగ్ కూడా తన సినిమాలో క్రియేట్ చేస్తాడు. 
Image result for ram charan vinaya vidheya rama
ఆ మద్య అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమాలో అంజలితో ఐటమ్ సాంగ్ చేయించాడు.  తాజాగా రాంచరణ్ నటిస్తున్న  'వినయ విధేయ రామ'  సినిమాలో స్టార్ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ చేయిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘ధృవ’ సినిమాలో హీరోయిన్‌గా నటించి అలరించిన రకుల్ ప్రీత్.. ఇప్పుడు చెర్రీతో ఐటెం సాంగ్‌కి సిద్ధమైపోతోందనే వార్తలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.  'సరైనోడు'లోను .. ఆ తరువాత 'జయ జానకి నాయక'లోను రకుల్ కి బోయపాటి ఛాన్స్ ఇచ్చాడు.
Image result for ram charan vinaya vidheya rama
ఇప్పుడు 'వినయ విధేయ రామ' లోను ఆమె మెరిసేలా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.  ఇందుకు రకూల్ కూడా సై అనే ఛాన్స్ ఉంది. . ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో గుమ్మడికాయ కొట్టేయనుంది.  అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని  సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దర్శక, నిర్మాతలు. మరి చెర్రీ సరసన రకూల్ ఐటమ్ సాంగ్ అంటే భారీ అంచనాలే ఉండబోతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: