పదహారేళ్ళ వయసు సినిమాను ఎవరూ మరచిపోలేరు. అందులో యాక్ట్ చేసిన శ్రీదేవిని కూడా మరచిపోలేరు. ఇక జగదేకవీరుడు పక్కన తళుక్కున మెరసిన అతిలోక సుందరిని కూడా ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అందానికి ప్రతిరూపం అంటే శ్రీదేవి పేరే ఠక్కున చెబుతారు. అటువంటి అందగత్తె కూతురు తన పుట్టినిల్లు లాంటి టాలీవుడ్ కి రావాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆ మాటకు వస్తే శ్రీదేవి కూడా అదే అనుకున్నారట. తన కుమార్తె జాన్వీకపూర్ మొదటి సినిమా తెలుగులోనే చేయించాలని, బెస్ట్ కాంబోతో దూసుకెళ్ళాలని భావించారట. బ్యాడ్ లక్ కుదరలేదు. ఇంతలో శ్రీదేవే మన మధ్య నుంచి దూరం అయ్యారు. 


ఈ లోగా హిందీలో దఢక్ పేరు మీద ఓ సినిమా చేసేసిన జాన్వీ అక్కడ బంపర్ హిట్ కొట్టింది. దాంతో రెండవ మూవీ కూడా హిందీలోనే చేస్తోంది. ప్రస్తుతం ఆ మూవీ హడావిడిలో ఉన్న్న జాన్వీకపూర్ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతోందట. ఆమె తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూడా టాలీవుడ్లో జాన్వీ ఎంట్రీ గ్రాండ్ లెవెల్లో ఉండాలని సన్నాహాలు చేస్తున్నారట.


ఇంతలో ఆర్ ఆర్ ఆర్ మూవీని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళీ తెలుగుతో పాటు హిందీ, ఇతర భారెతీయ భాషల్లో భారీ బడ్జెట్ తో జూనియర్ నందమూరి, జూనియర్ మెగస్టార్ లతో రేర్ మల్టీ స్టారర్ స్టార్ట్ చేశారు. ఇదిపుడు టాక్ ఆఫ్ ది ఇండీయన్  సినిమా అయిపోయింది. దాంతో ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీని ఎంట్రీ ఇప్పిస్తే ఎలా ఉంటుందన్నది ఇపుడు బోనీ కపూర్ సీరియస్ గా ఆలోచిస్తున్నారుట


 అదే టైంలో రాజమౌళి కూడా జాన్వీ ఈ మూవీలో ఉంటే బాలీవుడ్లో మంచి హైప్ క్రియేట్ అయి నేషనల్ లెవెల్లో టాప్ రేపే మూవీ అవుతుందని అనుకుంటున్నారట. మరి జాన్వీ ఎంట్రీకి ఈ మూవీయే సరైన ఫాట్ ఫారం అని అందరూ భావిస్తున్న వేళ ఆ శుభ వార్త ఎవరు చెబుతారా అన్న ఇంటెరెస్ట్ పెరుగుతోంది. చూడాలి శ్రీదేవి కూతురు ఏం చేస్తుందో


మరింత సమాచారం తెలుసుకోండి: