నందమూరి నట సిమ్హం బాలక్రిష్ణ వంద సినిమాలు చేసినా ఎక్కడా వెనక్కు తగ్గడంలేదు. ఆయన ప్రస్తుతం 103 మూవీగా తన తండ్రి నందమూరి తారక రామారావు బయోపిక్ చేస్తున్నరు. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈ సినిమాపైనే బాలయ్య చూపు అంతా ఇపుడు ఉంది. డిసెంబర్ తో ఈ మూవీ షూటింగ్ ఫినిష్ అవుతుంది. మధ్యలో మూడు నెలలు ఉంటాయి ఎన్నికలకు, అందువల్ల వీవీ వినాయక్ డైరెక్షన్లో ఓ మాస్ మసాలా మూవీ చేసేసి ఎన్నికలకు పోవాలని బాలయ్య ప్లాన్ గా ఉంది.


ఆ తరువాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో భారీ యాక్షం మాస్ సినిమా ఒకటి బాలయ్య చేస్తారని అంటున్నారు. అది 2020 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని టాక్. ఆ సినిమా తరువాత బాలయ్య డ్రీం ప్రాజెక్ట్ ఒకదాన్ని సెట్స్ మీదకు తెస్తారని అంటున్నారు. బాలయ్యకు చారిత్రాత్మక పాత్రలు అంటే చాల ఇష్టం. వాటిలో ఒకటి శ్రీక్రిష్ణ దేవరాయలు. ఆ సినిమాను బాలయ్య చేయాలని అనుకుంటున్నారుట.


మొత్తం విజయనగర సామ్రాజ్యం, రాయల జీవితం, వారు సాధించిన విజయాలు, అష్ట దిగ్గజ కవులు ఇలా చాలా ఎంటెర్టైన్మెంట్ ఎంతో ఈ మూవీలో ఉంది. బాలయ్య అప్పట్లో ఆదిత్య 369 మూవీలో క్రిష్ణ దేవరాయలు పాత్ర వేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. అయితే పూర్తి నిడివితో ఆయన జీవిత చరిత్ర చేయాలని బాలయ్యకు ఉందని అంటారు.

దీనికి సంబంధించి  దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తారని కూడా న్యూస్ అప్పట్లో వచ్చింది. ఆ తరువాత సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలయ్య ఈ మూవీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఏది ఎలాగునా బాలయ్య డ్రీం ప్రాజెక్ట్ ఎప్పటికి పట్టాలెక్కుతునందన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: